మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను రెండు వారాల తర్వాతకు వాయిదా వేసింది. దీనిపై ఏప్రిల్ 29 తర్వాత విచారణ చేపడుతామని వెల్లడించింది.