ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వాపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా లేదని, మన సీఎంను వేధిస్తున్నారని, ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారని సునితా కేజ్రీవాల్ అన్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మార్చి 21వ తేదీన మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేశారు.