దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.25 పాయింట్ల లాభంతో 22,326.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది. బజాజ్, SBI, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాలు ఆర్జించాయి. టెక్ మహీంద్రా, రిలయన్స్, HCL టెక్నాలజీ, ఐటీసీ షేర్లు స్వల్ప నష్టపోయాయి.