అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక అడుగు

72చూసినవారు
అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక అడుగు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధానికి మణిహారంలా చెప్పుకునే ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో భాగంగా భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా,ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా ఈ ఓఆర్‌ఆర్‌ వెళుతోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్