తిరుమలాయపాలెం మండలం బచ్చోడు సబ్ స్టేషన్ పరిధి ఏలువారిగూడెంలో గత రాత్రి సమయంలో రైతు యల్మారెడ్డి మంగారెడ్డి వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న 25 కెపాసిటీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో గుర్తు తెలియని వ్యక్తులు రాగి తీగ చోరి చేశారు. ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి, దిమ్మెపై ఉన్న డీబీ ను కిందకు తోసి అందులో ఉన్న రాగి తీగ, ఆయిల్ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనపై ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు.