వరదల సమయాన రాజకీయాలు చేయడాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట, జలగంనగర్ ల్లో వరద బాధితులకు ఆయన నిత్యావసర సరుకులు అందచేసి మాట్లాడారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా నిర్మాణ అనుమతులు ఇవ్వడంతోనే ఇప్పుడు వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని, మంత్రి పొంగులేటి చొరవతో నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు.