గురుకుల పాఠశాలను సందర్శించిన సిపిఎం నాయకులు

51చూసినవారు
వైరా మండల పరిధిలోనే రెబ్బవరం మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆదివారం వైరా నియోజకవర్గ సిపిఎం పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు భూక్య వీరభద్రం మాట్లాడుతూ విద్యార్థులకు పంపిణీ చేసిన పురుగులు పట్టిన బియ్యాన్ని వాపస్ తీసుకోవాలని, పక్క భవనాలు ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, తూము సుధాకర్, ఎస్ఎఫ్ఐ నాయకులు కోటా ప్రేమ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్