వైరాలోని కేవీసీఎం డిగ్రీ, ఎన్నారై
పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. ఆ విషయాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం వైరాలో మూతపడి ఉన్న కళాశాలను పరిశీలించారు.