ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనీ, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. కొణిజర్ల మండల సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్న గోపతిలో ఈనెల 25, 26న జరిగే సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు.