రామోజీ పార్థివ దేహానికి కిషన్ రెడ్డి నివాళులు

61చూసినవారు
మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడి సృష్టించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి నివాళుర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘మద్యపాన నిషేధం, సామాజిక సమస్యలు, తెలుగు భాషను ప్రోత్సహించడం, సినిమా రంగంలో మార్పులు, ఫిల్మ్‌సిటీ నిర్మాణం ఇలా ఎన్నో విషయాల్లో ఆయన చేసిన కృషిని మరచిపోలేము. పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. ఆయన తీర్చిదిద్దిన అనేక మంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు' అని తెలిపారు.