లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై సాగర్

67చూసినవారు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై సాగర్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొమురం భీం అడ ప్రాజెక్టు కు భారీస్థాయిలో వరదనీరు వస్తుండటంతో అధికారులు నీటిని ఏక్షణంలోనైనా దిగువకు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కావున ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాంకిడి ఎస్సై సాగర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసిఫాబాద్ పెద్ద వాగు, గుండి వాగుల్లోకి గ్రామ ప్రజలు వెళ్లొద్దని ఎస్ఐ సూచించారు.
Job Suitcase

Jobs near you