అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం

72చూసినవారు
అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం
2025 నుంచి అమలులోకి రానున్న నూతన టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోంది. నూతన విధానంలో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒబరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటళ్లు నిర్మాణం కోసం ముందుకు వచ్చార‌ని మంత్రి వెల్ల‌డించారు. రాజధాని అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం త్వ‌రలోనే జరగనుందని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్