కొమురంభీం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 3 గేట్లు ఎత్తివేత

81చూసినవారు
ఆసిఫాబాద్ మండలంలోని కొమురంభీం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఆదివారం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అడ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా, 3200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 237. మీటర్ల స్థాయికి చేరింది. ఆదివారం 3 గేట్లను 0. 50 మీటర్ల మేర ఎత్తి 3200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

సంబంధిత పోస్ట్