పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమీషనర్‌

77చూసినవారు
పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమీషనర్‌
వాతావరణ శాఖ వారి సమాచారం ప్రకారం రానున్న 3 రోజులు వర్షాలు అధికముగా ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలోనే ఇంటి నుండి బయటికి రాగలరని కాగజ్‌నగర్‌ మున్సిపల్ కమీషనర్‌ ఎస్ అంజయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో గాని, నాళాలలో గాని నీరు నిలిచినా, లేదా అత్యవసర సేవలకు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం. 8712803804 కి సమాచారాన్ని ఇవ్వగలరని సూచించారు.

సంబంధిత పోస్ట్