హనుమాన్ మాలాధారులతో కిక్కిరిసిన కొండగట్టు (వీడియో)

80చూసినవారు
తెలంగాణలో ప్రముఖ హనుమాన్ పుణ్యక్షేత్రం కొండగట్టుకు మాలాధారులు పోటెత్తారు. హనుమాన్ దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరావడంతో కొండగట్టులో రద్దీ నెలకొంది. ఎరుపు వస్త్రాలు ధరించిన హనుమాన్ భక్తులతో కొండగట్టు ఎరుపు వర్ణంగా మారింది. పెద్ద హనుమాన్ జయంతి సందర్బంగా ఆంజనేయునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి ఇష్టమైన తమలపాకులను నివేదించారు. భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకొని పూజలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్