బాలికలు క్రమశిక్షణగా మెలిగి చక్కని పరీక్ష ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డిప్యూటీ సీఈవో, భద్రాచలం మండల స్పెషల్ ఆఫీసర్ బి. నాగలక్ష్మి పిలుపునిచ్చారు. భద్రాచలం గిరిజన గురుకులంలో శుక్రవారం నిర్వహించిన వాయిస్ ఫర్ గర్ల్స్ ముగింపు వేడుకకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.బాలికలు ఇప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా సమాజాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతారని తెలిపారు.