మోసం చేశారని రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన

75చూసినవారు
మోసం చేశారని రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన
మణుగూరుకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రాములు ఆదివారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఓ నాయకుడు తన భూమిని తనకు విక్రయించాడని, ఆ భూమి తాను తీసుకున్న తర్వాత అది వేరే వాళ్ళ భూమి అని తెలిసిందన్నారు. భూమికోసం లక్షలు పెట్టి కొన్నానని తనను గత నాయకులు మోసం చేశారని వాపోయారు. తన కొడుకు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని తనకు న్యాయం చేయాలని కోరాడు.

సంబంధిత పోస్ట్