కొండా సురేఖపై కేటీఆర్‌ పిటిషన్‌.. 18కి విచారణ వాయిదా

50చూసినవారు
కొండా సురేఖపై కేటీఆర్‌ పిటిషన్‌.. 18కి విచారణ వాయిదా
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. పిటిషనర్‌తో పాటు సాక్షులుగా ఉన్న బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ వాంగ్మూలాను నమోదు చేయనున్నట్లు వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణ 18కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్