మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ.. షాకింగ్ వీడియో

67చూసినవారు
మద్యం మత్తులో కొందరు ఏం చేస్తుంటారో, పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఓ చోట కూర్చున్నాడు. అయితే తన మీదకు కొండచిలువ పాకుతున్న లేవలేనంత మత్తులో ఆ వ్యక్తి మునిగిపోయాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లిలో జరిగింది. స్థానికులు గమనించి కట్టెల సహాయంతో కొండచిలువను లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత పోస్ట్