ఇద్దరు యువకులపై కత్తితో దాడి.. ఒకరు మృతి (వీడియో)

68చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. ఇద్దరు అన్నదమ్ములపై కత్తితో దాడి చేశారు. దీంతో వారిలో ఓ యువకుడు మరణించగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దసరా పండుగ వేడుకలను చూసేందుకు ఇద్దరు అన్నదమ్ములు వెళుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ వీరిని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులతో వీరికి వాగ్వాదం జరిగింది. ఇది తారాస్థాయికి చేరి ఒకరి మరణానికి కారణమైంది.

సంబంధిత పోస్ట్