హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. రాజేంద్రనగర్లోని మొయినాబాద్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో తోల్కట్టా వద్ద ఓ షెడ్డుపై SOT పోలీసులు దాడిచేసి సౌరబ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనితోపాటు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి 92 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని ఉప్పుగూడలో రూ.5 లక్షల విలువైన 14కిలోల గంజాయిని శంషాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు.