‘మంచి స్నేహితుడిని కోల్పోయా’: అంబానీ పోస్ట్‌

78చూసినవారు
‘మంచి స్నేహితుడిని కోల్పోయా’: అంబానీ పోస్ట్‌
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ.. రతన్‌ టాటాకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘నేనొక మంచి స్నేహితుడిని కోల్పోయాను. రతన్ టాటా మరణించడం కేవలం టాటా గ్రూపుకే కాదు.. ప్రతీ భారతీయుడికి తీరని లోటు. టాటా మరణం నాలో ఎనలేని దుఃఖాన్ని నింపింది. రిలయెన్స్‌, నీతా అంబానీ, అంబానీ కుటుంబ సభ్యుల తరఫున.. టాటా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రతన్‌ ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటారు’’ అని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్