పశువుల కొవ్వుతో నూనె తయారీ

3251చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పశువుల కొవ్వు నుండి నకిలి నూనె తయారు చేస్తూ స్థానికంగానే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం లోని రైచూర్ పట్టణానికి, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ కు డబ్బాలలో ప్యాక్ చేసి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐజ పట్టణంలోని ఒక పశువుల కొట్టంలో పట్టణ పోలీసులు దాడి చేసి కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్