కౌకుంట్లలో ఘనంగా ఏరువాక ఉత్సవాలు

56చూసినవారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం కేంద్రంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. సుమారు 20ఎడ్లబండ్లతో ఊరేగింపు చేస్తూ ఏరువాక తోరణాన్ని తెంపుటకు రైతులు పోటీపడ్డారు. చివరకు కావలి చిన్న కురుమన్న అని రైతు ఏరువాక తోరణాన్ని తెంపి విజేతగా నిలిచారు. గ్రామస్తులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని ఈ సన్నివేశాన్ని వీక్షించారు.

సంబంధిత పోస్ట్