ఈనెల 25 నుండి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు పదవ తరగతి, నాలుగు ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.