వాలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో తొలిసారి రేపు లబ్ధిదారుల అకౌంట్లలో ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులు జమ చేయనుంది. రాష్ట్రంలో 65.49 లక్షల మంది పెన్షన్దారులు ఉండగా, దాదాపు 49 లక్షల మంది ఖాతాల్లోకి ఉదయం 8.30-11 గంటల మధ్య డీబీటీ ద్వారా నగదు పంపనుంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్ కాని మిగతా వారికి మే 3 వరకు ఇంటి వద్దే ఉద్యోగులు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.