ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి జర్నల్లో ప్రచురించిన సైంటిస్ట్ జాంగ్ యోంగ్జెన్ను చైనా ప్రభుత్వం వేధిస్తోంది. ఇప్పటికే డిమోషన్లతోపాటు పలు కార్యక్రమాలకు ఆయనను బహిష్కరించింది. తాజాగా జాంగ్ పనిచేస్తోన్న ల్యాబ్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. తన బృందాన్ని కూడా ల్యాబ్ నుంచి బయటకు పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.