భారత నావికాదళం నూతన చీఫ్గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దినేష్ త్రిపాఠికి 26వ నేవీ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు చీఫ్గా ఉన్న హరికుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కేంద్రప్రభుత్వం త్రిపాఠిని నియమించింది. ఈ మేరకు ఈనెల 19న అధికారిక ప్రకటన జారీచేసింది.