నారాయణపేట పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్ అన్నారు. గురువారం నారాయణపేట సీవీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తారని వాటి ద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేయవచ్చని పార్టీ మారినట్లు చెప్పారు.