చోరీ సంఘటనలో ఓవ్యక్తిని అరెస్టు చేశామని ఎస్ఐ శ్రీహరి తెలిపారు. ఎస్ఐ వివరాలు మేరకు. ఇటీవల భారతమ్మ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఖిల్లాగణపురం మండలంలోని వెంకటాంపల్లికి చెందిన చెన్నయ్య ఖిల్లాగణపురంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. భారతమ్మ ఇంట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. కోర్టులో హాజరుపరిచి, రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.