అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కోర్టులో 175 బిలియన్ డాలర్ల (రూ.1,460 కోట్లు) బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు. ట్రంప్ బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.