అబద్ధాల బీఆర్ఎస్, బీజేపీలను నమ్మకండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

63చూసినవారు
అబద్ధాల బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తిలో నిర్వహించిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 'వనపర్తిలో ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదు. ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ కనుమరుగవుతుంది. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు ఉన్న బిఆర్ఎస్ లు కేవలం అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకున్నాయి. నిరుపేదల అభివృద్ధి కోసం ఏమి చేయలేదు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్