సింహం దాడిలో వ్యక్తి దుర్మరణం

1069చూసినవారు
సింహం దాడిలో వ్యక్తి దుర్మరణం
సింహం దాడిలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, జూ క్యూరేటర్ వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ జూకు వచ్చి నిబంధనలకు విరుద్దంగా సింహం ఎన్‌క్లోజర్‌ వద్దకు వెళ్లాడు. అనంతరం వాటర్ ట్యాంక్ మీదుగా ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. వెంటనే అందులోని సింహం అతడిని కొరికి చంపేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్