భారత జట్టు కోచ్గా రాహుల్ ద్రావిడ్ రాబోయే టీ20 ప్రపంచకప్ వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియజేశారు. ద్రవిడ్తో ఒప్పందం గతేడాది వన్డే ప్రపంచకప్తో ముగిసింది. అయితే డిసెంబర్-జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అతడిని కోచ్ గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరింది. తాజాగా ద్రావిడ్తో మాట్లాడి టీ20 ప్రపంచకప్ వరకు ఒప్పందాన్ని పొడిగించినట్లు షా వెల్లడించారు.