పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

58చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను ఎక్కడికక్కడ తొలగించారు.. అనంతరం స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం దేవానంద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.