ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతేడాది నుంచి ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 122 మంది మావోయిస్టులు మృతి చెందారు.