కోల్కతాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కస్బా ప్రాంతంలోని అక్రోపోలిస్ మాల్లో మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు షాపింగ్ మాల్లోని నాలుగు అంతస్తులో ఉన్న ఫుడ్కోర్టుకు చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ఇప్పటికే 4 ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.