సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు. దీనిని ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి సైంటిస్టులు సృష్టించారు. ఈ 'మాంసపు బియ్యం'(మీటీ రైస్)లో సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు కలిగివుంటాయి. ‘మీటీ రైస్’ పర్యావరణ హితమైందని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హాంగ్ జిన్-కీ చెప్పారు.