సీఎంను కలిసిన నీలం మధు
మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఖాయమని, మెదక్ పార్లమెంట్ లో మనమే గెలుస్తున్నామని ఎంపీ అభ్యర్థి నీలం మధుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షిని కలిసిన నీలం మధు పోలింగ్ సరళిని వివరించారు.