'ద్రవ్యోల్భణం, అధిక పన్నులు, విద్యుత్ కొరత'కు వ్యతిరేకంగా పీఓకే ప్రాంతంలోని ప్రజలు భారీ ఆందోళనలు చేస్తున్నారు. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్ని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు, నగరాలకు తరలిస్తున్నారని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు, భద్రతా సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.