VIDEO: పీఓకే నిరసనకారులపై పోలీసుల కాల్పుల వర్షం

78చూసినవారు
పీఓకేలో ప్రజల నిరసనను అణిచివేయడానికి పాకిస్తాన్ రేంజర్లు, స్థానిక పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. శాంతియుతంగా ప్రారంభమైన మార్చ్​.. బలగాలు గాల్లోకి కాల్పులు జరపడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏకే 47లతో కాల్పులు జరిపినట్లు చూపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.