పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజల నిరసనలు

1106చూసినవారు
పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజల నిరసనలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే) లో ‘ఆజాదీ’ నినాదాలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పాక్ రేంజర్లు, స్థానిక పోలీసులుతో దాడులు చేయిస్తోంది. ఇప్పటికే ఈ నిరసనల్లో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఘర్షనల్లో ఒక పోలీస్ అధికారితో పాటు మరో 90 మంది గాయపడ్డారు.