పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎట్టకేలకు ఆందోళనలను విరమించారు నిరసనకారులు. తమ డిమాండ్లను పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించడం వల్ల కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలను మంగళవారం మధ్యాహ్నం నుంచి విరమిస్తున్నట్లు నిరసనకారులు ప్రకటించారు. భద్రతాబలగాల కాల్పుల్లో మరణించిన వ్యక్తుల పట్ల సంతాపంగా శాంతియుత ప్రదర్శన నిర్వహించారు.