భూ వివాదంపై సీఎంను కలుస్తున్నా: మల్లారెడ్డి

61చూసినవారు
భూ వివాదంపై సీఎంను కలుస్తున్నా: మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రలో భూ వివాదం ఘటనపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని అన్నారు. రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు చెప్పారు. కాగా మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై నిన్న కేసు నమోదైన విషయం తెలిసిందే.