బాలివుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో ఉన్న ఆయనకు ప్రధాని మోడీ ఫోన్ చేసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ’ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు ‘ అని మిథున్ చెప్పుకొచ్చారు. ’నేను బాగానే ఉన్నాను‘ అని ఆయన మీడియాకు తెలిపారు.