రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చే ఆగస్టులో కుప్పకూలవచ్చునని లాలూ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. కాబట్టి ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.