మోదీ మరో పుతిన్: పవార్

81చూసినవారు
మోదీ మరో పుతిన్: పవార్
ప్రధాని మోదీ మరో పుతిన్ అనిపిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. అందరిలో భయాన్ని పుట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 'కొత్త భారతదేశాన్ని నిర్మించేందుకు నెహ్రూ తర్వాత ఇందిర, రాజీవ్, నరసింహారావు, మన్మోహన్ లాంటి ప్రధానులు చేసిన కృషిని చూశాం. ప్రస్తుత పీఎం మాత్రం కేవలం విమర్శలకు పరిమితం, పదేళ్లలో ఏం చేశారో చెప్పరు. ఇతరుల్ని మాత్రం కించపరుస్తారు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్