పోస్టాఫీసులు అందించే వివిధ పథకాలపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాదాపు 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కొన్ని రకాల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ పెరిగింది. అందుకే పోస్టాఫీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నెలకు రూ.9,999 ఇన్వెస్ట్ చేస్తే ప్లాన్ ముగిసే సమయానికి రూ.9 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ 12 వాయిదాలు చెల్లించిన తర్వాత రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోజనం కోసం మీ సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించవచ్చు.