కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అది సెక్స్ స్కాండ్ కాదు, అదో మాస్ రేప్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళల్ని రేప్ చేశాడని, అయినా రేపిస్టుకు ప్రధాని మోదీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. రేవణ్ణ ఓ సామూహిక రేపిస్టు అన్న విషయం బీజేపీ నేతలకు తెలుసని, అయినా జేడీఎస్తో కూటమి ఏర్పాటు చేశారని విమర్శించారు.