వచ్చే వారం కజకిస్థాన్ లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సమావేశం పుతిన్ కు వ్యతిరేకంగా అభిప్రాయాలు కూడగడుతుందన్న సమాచారం. అధికారికంగా ఎస్సీఓ సమావేశానికి మోదీ హజరు విషయంపై సమాచారం రానప్పటికీ దౌత్యవేత్తలు మాత్రం ధృవీకరించారు. బదులుగా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కజకిస్థాన్ లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.